ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామడుగు విఠలేశ్వర వెంకటేశ్వర దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కళ్యాణ వేడుకల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు
సర్పంచి ఎండి మొయిజ్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ విజయ్, ఆంజనేయులు, ఉప సర్పంచ్ పెందోటి రాజు, కార్యదర్శి శ్రీనివాసు, హనుమాన్ భక్తులు పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది.
