పల్నాడు జిల్లాలో నరసరావుపేట లోని ఇటీవల ప్రకాష్ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్కు చెందిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వివిధ స్టూడెంట్ యూనియన్లు కలిసి జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు నిర్వహించారు.
డీఈవో తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, నిజాలను బయటపెట్టాలని నినాదాలు చేశారు
