జాతీయంహోమ్

ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

#UmarKhalid

ఢిల్లీ మారణ కాండకు బాధ్యుడని భావిస్తున్న మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఐదేళ్లకు పైగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్‌ 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన మతపరమైన అల్లర్లకు బాధ్యుడుగా ఆరోపణలు ఉన్నాయి. 38 ఏళ్ల ఉమర్ ఖాలిద్‌ను 2020 సెప్టెంబర్‌లో కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశారు.

కుటుంబంలో పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు ఇచ్చిన తాత్కాలిక విడుదలలు తప్ప, అప్పటి నుంచి అతను నిరంతరం కస్టడీలోనే ఉన్నాడు. ఢిల్లీ అల్లర్లలో మొత్తం 53 మంది మరణించారు. ఢిల్లీకి చెందిన ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో విద్యార్థిగా ఉన్న ఖాలిద్‌పై ప్రాణాంతక ఆయుధాలతో అల్లర్లు చేయడం, హత్యాయత్నం, రాజద్రోహం, వేర్వేరు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

అల్లర్లకు ముందు ఖాలిద్ “ఉద్రేకపూరిత ప్రసంగాలు” చేశాడని పోలీసులు ఆరోపించారు. 2022లో ఖాలిద్ ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తూ, “మాపై కేసులు పెట్టినవారు ఏమీ నిరూపించాల్సిన అవసరం లేకుండానే మమ్మల్ని సంవత్సరాల తరబడి జైలులో ఉంచవచ్చు” అని పేర్కొన్నాడు. ఖాలిద్ భాగస్వామి బానోజ్యోత్స్న లాహిరి మాట్లాడుతూ, “అతను ఎప్పుడూ పోరాడిన అన్యాయానికే చివరకు బలయ్యాడు” అని అన్నారు.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు మరో ఆరు మానవ హక్కుల సంస్థలు సెప్టెంబర్‌లో ఖాలిద్‌ను విడుదల చేయాలని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. “ఖాలిద్‌పై కొనసాగుతున్న దీర్ఘకాలిక వేధింపులు భారత న్యాయవ్యవస్థ ఎలా దారి తప్పుతోందో చూపిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల సూత్రాలను ఎగతాళి చేస్తోంది” అని అతను జైలులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్నెస్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కొద్ది నెలల తర్వాత ఖాలిద్ అరెస్ట్ జరిగింది. 2019లో తీసుకొచ్చిన ఈ చట్టం, మూడు పొరుగుదేశాల నుంచి వచ్చే వేధింపులకు గురైన మతపు మైనారిటీలకు పౌరసత్వం పొందడం సులభతరం చేస్తుంది. అయితే ముస్లింలకు మాత్రం ఈ అవకాశం ఇవ్వదు.

సుప్రీంకోర్టు ఖాలిద్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, “దీర్ఘకాలంగా జైలులో ఉండటం మాత్రమే బెయిల్‌కు అర్హత కాదని” స్పష్టం చేసింది. అదే కారణాలతో మరో విద్యార్థి కార్యకర్త షర్జీల్ ఇమామ్‌కు కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే ఇదే కేసులో ఉన్న మరో ఐదుగురికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది.

Related posts

కొత్త జిల్లాలలపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి

Satyam News

రేవంత్ రెడ్డి ది తుగ్లక్ పాలన

Satyam News

ఘనంగా గౌలిపుర మహంకాళి అమ్మవారి బోనాల వేడుక

Satyam News

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Satyam News

రోజా రివర్స్‌ గేర్‌.. ఎవరిది డైవర్షన్‌..? ఏది రాజకీయం..??

Satyam News

16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Satyam News

Leave a Comment