టైర్ పేలి కారు బోల్తా పడడం తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందారు.
టీచర్లు ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురు టీచర్లకు గాయాలు కాగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
