నల్గొండహోమ్

బా.సి.రెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

స్వేచ్చ, స్వాతంత్య్రం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ, అంతిమంగా మనిషి మనిషిగా గుర్తించబడే సమాజం కోసం జీవితాంతం పోరాడిన నర్రా బాలసిద్ధారెడ్డి (బా.సి.రెడ్డి) జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయాకమని పలువురు వక్తలు వెల్లడించారు. చిరుప్రాయంలోనే తల్లి దండ్రులను కోల్పోయి అనాధ జీవితాన్ని గడుపుతునే, కమ్యూనిజం వైపు ఆకర్షితులై, నిరుపేదల పక్షపాతిగా నిలబడి ఆయన చేసిన పోరాటాలు చిరస్మరనీయమని వారు కొనియాడారు.

కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుడు, తన తండ్రి బా.సి.రెడ్డి పోరాట జీవితంపై సుప్రసిద్ధ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన “నాగటి తరం” నవల అవ్విష్కరణ సభ ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం బందారంలో జరిగింది.

నేటినిజం పత్రిక సంపాదకులు, కవి బైసా దేవిదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవి, రచయిత వాసిరెడ్డి నవీన్ నవలను అవిష్కరించగా, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కవి గాయకులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టిఎన్జిఓల సంఘం మాజీ అధ్యక్షులు దేవిప్రసాద్ రావు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాలేశ్వరం శంకరం, ప్రముఖ కవులు కందుకూరి శ్రీరాములు, భగవాన్ రెడ్డి, సిద్దంకి గిరి, తైదల అంజయ్య, మల్లారెడ్డి, తోట అశోక్ లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు మేం సిద్ధం

Satyam News

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News

అక్రమ బొగ్గు మాఫియా పై ఈడీ దాడులు

Satyam News

పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం

Satyam News

వైభవంగా “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం

Satyam News

వచ్చే నెలలో భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు

Satyam News

Leave a Comment