గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్తో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ చర్చల అనంతరం, ఈ నెలలో డిమాండ్కు అనుగుణంగా సాధారణం కంటే 10 శాతం అదనంగా పెట్రోల్, డీజిల్ను సరఫరా చేయడానికి ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని ట్రేడర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇకపై సరఫరా క్రమబద్ధంగా జరుగుతుందని, పుకార్లను నమ్మి కంగారు పడవద్దని అధికారులు సూచించారు.
