26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

#Petrol

గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ చర్చల అనంతరం, ఈ నెలలో డిమాండ్‌కు అనుగుణంగా సాధారణం కంటే 10 శాతం అదనంగా పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయడానికి ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని ట్రేడర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇకపై సరఫరా క్రమబద్ధంగా జరుగుతుందని, పుకార్లను నమ్మి కంగారు పడవద్దని అధికారులు సూచించారు.

Related posts

హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

మోహన్ భాగవత్ పై కాంగ్రెస్ ఘాటు విమర్శ

Satyam News

క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి

Satyam News

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

Satyam News

Leave a Comment