పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, ప్రతాప్, శరత్గా గుర్తించారు. రబ్బర్ డ్యాంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో సివిని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి వివరాలు: అధికారి గోవింద (35), అరసాడ ప్రతాప్ (29), రాయగడ శరత్ కుమార్ (17). పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
previous post
next post
