అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా బస్సులో 39 మంది యాత్రికులు ఉన్నారు. ఏడు రోజులపాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు తొమ్మిది మంది దుర్మణం చెందారు. కాగా మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఈ ఘోర జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
previous post
next post
