తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ సి.శివలీల అన్నారు. మంగళవారం నారాయణగూడ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) ప్రాంగణంలోని దుర్గాదేవి ఆలయంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె పాల్గొని బోనాల వేడుకలను ప్రారంభించి ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాస్ రావు, ముజీబ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎం. సత్యనారాయణగౌడ్, రాసూరి జ్ఞానేశ్వర్, బంగ్లా సుశీల్, ఎం.శ్రీనివాస్ రావు, నవీన్ కుమార్, శ్రీకాంత్, మహేష్, ప్రదీప్, సంతోష్, నరేష్, ప్రశాంత్, డి.ప్రభాకర్, కన్నె రమేష్ యాదవ్, బల్వీర్, డాక్టర్ విజయశాంతి, డాక్టర్ ఉమా, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సాయితేజ, జగన్మోహన్ మోహన్ రావు, డాక్టర్ రమా, శైలజ, ముకరాల చంద్రశేఖర్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్, డాక్టర్ అయోషా, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ సబిత, డాక్టర్ దివ్యకీర్తి, డాక్టర్ కలీల్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్
