రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ – ఛాన్సలర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా – వెంకట సత్యనారాయణ రాజు సమంతపుడి నియమితులయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా – తాతా నర్సింగరావు, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీగా – బి.జయరామిరెడ్డి, జేఎన్టీయూ (విజయనగరం) వీసీగా -వి.వెంకటసుబ్బారావు, యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) వీసీగా – రాజశేఖర్ బెల్లంకొండ నియమితులయ్యారు.
previous post
Satyam News
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
