25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

పాకిస్తాన్ చొరబాటుదారుడి కాల్చివేత

#Pakistan

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో భారత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు (IB) వద్ద పాకిస్తాన్‌కు చెందిన ఓ చొరబాటుదారుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది కాల్చి చంపినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి రామ్‌గఢ్ సెక్టార్‌లోని మజ్రా ప్రాంతం వద్ద ఉన్న బోర్డర్ అవుట్‌పోస్ట్ చెక్ పాయింట్ ద్వారా పాకిస్తాన్ పౌరుడు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.

చీకటి ఉపయోగించుకొని చొరబడే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతని కదలికలను BSF సిబ్బంది గుర్తించారు. చొరబాటుదారుడిని ఆపేందుకు BSF సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అతడు వాటిని పట్టించుకోకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహం ప్రస్తుతం అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోనే ఉందని, సోమవారం ఉదయం వెలుగు వచ్చే వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల అనంతరం మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘటనతో సాంబా జిల్లాలో సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

Related posts

ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన నగర క్రీడాకారులు

Satyam News

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తోనే సమగ్ర క్రీడాభివృద్ధి

Satyam News

విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

Satyam News

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Satyam News

వైసీపీకి బిరియానీ దెబ్బ… జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు

Satyam News

Leave a Comment