26.3 C
Hyderabad
September 19, 2026
రంగారెడ్డిహోమ్

కీసర గుట్ట పై శివ రాత్రి సందడి

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజనసంద్రమైంది. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఓం నమశ్శివాయ నామస్మరణతో కీసరగుట్ట కొండ పరిసరాలు మారుమోగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

కీసరగుట్ట వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనాల కోసం విడివిడిగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు పోటెత్తినందున జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 13 నుండి 18 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను బయటి రింగ్ రోడ్డు (ORR) వైపు మళ్లిస్తున్నారు.

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కీసరగుట్టకు వివిధ ప్రాంతాల నుండి 326 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. పార్కింగ్ స్థలం నుండి ఆలయం వరకు భక్తులను చేరవేసేందుకు షటిల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే క్యూలైన్లలో భక్తులు తమ నగలు, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల ఒక చైన్ స్నాచింగ్ ఘటన వెలుగులోకి రావడంతో భద్రతను మరింత కఠినతరం చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా రోజంతా ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ జరిగే లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కోసం భక్తులు వేచి చూస్తున్నారు.

Related posts

ఆంధ్రలో కయ్యం… తెలంగాణ లో మిత్రత్వం

Satyam News

ఆగస్టు 7న ఓబిసి జాతీయ మహాసభకు రండి

Satyam News

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

Satyam News

పెరిగిపోతున్న షుగర్ డాడీ కల్చర్

Satyam News

భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన అధ్యాయం

Satyam News

సీఎంగా జగన్ జల్సాలు.. గాల్లో సరదాలు..

Satyam News

Leave a Comment