ఖమ్మంహోమ్

ఆంధ్రలో కయ్యం… తెలంగాణ లో మిత్రత్వం

రాజకీయాల్లో పరస్పరం తీవ్రంగా విభేదిస్తూ పొట్లాడుకునే పార్టీలు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్కటయ్యాయి. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ యుద్ధం చేసే కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, వైయస్‌ఆర్‌సీపీ పార్టీలు సత్తుపల్లిలో మాత్రం కలిసికట్టుగా రోడ్‌షోలో పాల్గొని మిత్రత్వ రాజకీయానికి ఉదాహరణగా నిలిచాయి.

నాలుగు పార్టీల జెండాలు ఒకే వేదికపై దర్శనమివ్వడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది.సత్తుపల్లి పట్టణ శివారు నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్‌షోలో కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం, జనసేన, వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొని ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన వక్తలు, గతంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రస్తుత పాలనలో సత్తుపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాలుగు పార్టీల శ్రేణులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Related posts

అంతులేని కథ కు 50 ఏళ్లు

Satyam News

నాలుగు యుగాల ఆవిర్భావం ఎలా జరిగింది?

Satyam News

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఖేలో ఇండియా డైలాగ్

Satyam News

ఏపీకి కేంద్రం కీలక ప్రాజెక్ట్‌… దేశానికే కీలకం…!!

Satyam News

పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు

Satyam News

బీ ఆర్ ఎస్ ను చెప్పి మరీ చితక్కొట్టిన రేవంత్

Satyam News

Leave a Comment