రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జన్నార్ ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
రాయచోటిలోని స్థానిక గెస్ట్ హౌస్లో జరిగిన ఈ భేటీలో, ఎస్పీ సీపీ సజ్జన్నార్ కి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను అందజేసి, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవపూర్వక అభినందనలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న భద్రతా ఏర్పాట్లు మరియు పలు పోలీస్ సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా కాసేపు చర్చించారు.
