26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

కల్తీ టీ పౌడర్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో కల్తీ టీ పౌడర్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. టాస్క్‌ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేశారు. కోకోపీట్, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు. ఒక కిలో టీ పౌడర్ తయారీ కోసం 50 గ్రా. కోకోపీట్ మిశ్రమం ఉపయోగిస్తున్నాడు. అలాగే సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజిన్ రంగులను వినియోగిస్తున్నాడు.

దాడులకు పాల్పడిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 120 కిలోల కలర్ మిక్స్‌డ్ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల నేచురల్ టీ పౌడర్, 138 కిలోల కోకోపీట్ మిక్స్‌, 800 గ్రా. సన్‌సెట్ కలర్, 700 గ్రా. టార్ట్రాజిన్ స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ ఈ కల్తీ టీ పౌడర్‌ను స్థానిక టీ స్టాల్స్, డీలర్లకు అధిక ధరకు సరఫరా చేస్తున్నాడు.

Related posts

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

Satyam News

బోటు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎంఎల్ఏ

Satyam News

మమత పార్టీకి మరో ఎదురుదెబ్బ: ఇక ఖాళీ

Satyam News

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News

ఎజిఐసిఎల్‌‌లో సిబ్బంది కొరత: మరి అభివృద్ధి ఎలా?

Satyam News

Leave a Comment