హైదరాబాద్హోమ్

కల్తీ టీ పౌడర్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో కల్తీ టీ పౌడర్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. టాస్క్‌ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేశారు. కోకోపీట్, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు. ఒక కిలో టీ పౌడర్ తయారీ కోసం 50 గ్రా. కోకోపీట్ మిశ్రమం ఉపయోగిస్తున్నాడు. అలాగే సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజిన్ రంగులను వినియోగిస్తున్నాడు.

దాడులకు పాల్పడిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 120 కిలోల కలర్ మిక్స్‌డ్ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల నేచురల్ టీ పౌడర్, 138 కిలోల కోకోపీట్ మిక్స్‌, 800 గ్రా. సన్‌సెట్ కలర్, 700 గ్రా. టార్ట్రాజిన్ స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ ఈ కల్తీ టీ పౌడర్‌ను స్థానిక టీ స్టాల్స్, డీలర్లకు అధిక ధరకు సరఫరా చేస్తున్నాడు.

Related posts

ఇందాపూర్‌.. వైసీపీ….. ఓ కల్తీ కథ…!!

Satyam News

వర్ష బాధితుల్ని పట్టించుకోని మంత్రి దామోదర

Satyam News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కెనడా హై కమిషనర్

Satyam News

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు

Satyam News

యుద్ధ ప్రభావంతో కండోమ్ ల ధరల పెరుగుదల?

Satyam News

రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు చర్యలు ప్రారంభం

Satyam News

Leave a Comment