25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

మై టిడిపి యాప్ వినియోగంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగు యువత మరియు ఐటీడీపీ ప్రెసిడెంట్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్. జానీ సైదా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని, ‘మై టిడిపి’ యాప్ వినియోగంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక రాజకీయాల్లో సాంకేతికత కీలకమని, పార్టీ కేడర్‌ను క్షేత్రస్థాయి నుంచి అనుసంధానించడానికి ఈ యాప్ ఒక వంతెనలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త మరియు నాయకుడు ‘మై టిడిపి’ యాప్‌ లో భాగస్వాములు కావాలని, పార్టీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరియు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా తెలుగు యువత మరియు ఐ టీడీపీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, సోషల్ మీడియా వేదికగా పార్టీ గళాన్ని వినిపించాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఐటీడీపీ ప్రతినిధులు, తెలుగు యువత నాయకులు, టీడీపి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

చరిత్ర సృష్టిస్తున్న మిడ్ ఫీల్డర్ రుతుజ

Satyam News

పరిశ్రమల మనుగడకు పటిష్ట నీటి నిర్వహణే కీలకం

Satyam News

జిందాల్ ఎంఎస్ఎమ్ఈ పార్క్ వర్చువల్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Satyam News

ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా?

Satyam News

ప్ర‌జారోగ్యానికి స‌వాలుగా మారిన ఊబ‌కాయం

Satyam News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News

Leave a Comment