ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

#LingamaneniRamesh

రాజ్యసభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం లింగమనేని రమేష్ మీడియాతో మాట్లాడారు. “తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు.  రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాను” అని రమేష్ చెప్పారు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు నాగబాబు మాట్లాడుతూ “జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేశ్ రాజ్యసభకు వెళ్లడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఆయన సరైన వ్యక్తి. ఈ ఎంపిక పట్ల జనసేన పార్టీ శ్రేణులంతా ఎంతో సంతోషంగా ఉన్నాయి” అన్నారు.

Related posts

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

అమరావతిలో ఆస్ట్రో ఫిజిక్స్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం

Satyam News

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

Satyam News

గద్వాలలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

Satyam News

#TeamIndia: అణు క్షిపణులు తీసుకెళ్లే జలాంతర్గామి సిద్ధం

Satyam News

ట్రంప్ మరో సాహసం: డాలర్ పై సంతకం

Satyam News

Leave a Comment