25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులే ఉపయోగించుకోవాలి

#Narasaraopet

ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు తమ అభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. డ్వాక్రా రుణాలు వ్యాపారాలకు బదులుగా కుటుంబ అవసరాలకు వినియోగించడం, బాలింతలు మరియు బాలలకు ఇచ్చే పౌష్టికాహారం కుటుంబంలోని అందరూ వినియోగించడం చేయకుండా చూడాలన్నారు.

గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ గ్రామ హెల్త్ కేర్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి రూ.90 లక్షల చొప్పున గ్రామాల్లో పన్ను వసూళ్లు చేయాలని డీపీవోను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందితో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ నారద ముని, డి.ఎం.హెచ్.వో డాక్టర్. రవి, ఐ.సి.డి.ఎస్ పి.డి, ఎం. ఉమాదేవి, డి.పి.ఓ వి. నాగేశ్వరరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

Satyam News

తిరుమల కొండపై ఒక విలేఖరి ఆక్రమణలు

Satyam News

21 వ తేదీ నుండి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

Satyam News

గురుకుల పాఠశాల హాస్టల్ లో ఆహార నాణ్యతపై దృష్టి

Satyam News

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా

Satyam News

Leave a Comment