క్రీడలుహోమ్

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

#TeamIndia

టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు Board of Control for Cricket in India (BCCI) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ICC Men’s T20 World Cup 2026లో విజేతగా నిలిచిన సందర్భంగా రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజీలాండ్ జట్టు ను ఓడించి టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ మరో చరిత్ర సృష్టించింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. అంతేకాదు, ఈ ఫార్మాట్‌లో మూడుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా కూడా భారత జట్టు రికార్డు సృష్టించింది.

ఈ ఘన విజయానికి కారణమైన ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మరియు సెలెక్టర్లకు BCCI ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. భవిష్యత్తులో కూడా భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని బోర్డు ఆకాంక్షించింది. టీమ్ ఇండియా సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో అపార ఆనందాన్ని నింపింది. భారత్ క్రికెట్ చరిత్రలో ఇది మరో మైలురాయిగా నిలిచింది.

Related posts

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పై దాడి

Satyam News

కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News

సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాల ప్రతిష్ట

Satyam News

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

Satyam News

యాంకర్ అనసూయపై అసభ్య పోర్టు: ఒకరి అరెస్టు

Satyam News

తిరుమలలో నెయ్యి కల్తీతో లడ్డూ జిహాద్‌..?

Satyam News

Leave a Comment