ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులే ఉపయోగించుకోవాలి

#Narasaraopet

ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు తమ అభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. డ్వాక్రా రుణాలు వ్యాపారాలకు బదులుగా కుటుంబ అవసరాలకు వినియోగించడం, బాలింతలు మరియు బాలలకు ఇచ్చే పౌష్టికాహారం కుటుంబంలోని అందరూ వినియోగించడం చేయకుండా చూడాలన్నారు.

గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ గ్రామ హెల్త్ కేర్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి రూ.90 లక్షల చొప్పున గ్రామాల్లో పన్ను వసూళ్లు చేయాలని డీపీవోను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందితో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ నారద ముని, డి.ఎం.హెచ్.వో డాక్టర్. రవి, ఐ.సి.డి.ఎస్ పి.డి, ఎం. ఉమాదేవి, డి.పి.ఓ వి. నాగేశ్వరరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News

‘‘అక్రమ’’ జర్నలిస్టు అరెస్టు

Satyam News

తైవాన్ విషయంలో అమెరికాను హెచ్చరించిన చైనా?

Satyam News

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

Satyam News

వైసీపీని భయపెట్టిన జగన్‌ టూర్‌…!!

Satyam News

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

Satyam News

Leave a Comment