25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

#crime

చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గా సేవలందిస్తున్న గురవమ్మకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా, రూ. 9 లక్షలు ఫిర్యాదుకి చెల్లించేలా నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సలోమి మంగళవారం తీర్పు వెలువరించారు.

గురవమ్మ 2019 సెప్టెంబర్ 14 న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి రక్షణ లత వద్ద రూ ఆరు లక్షలు అప్పుగా తీసుకున్నారు . ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. చెల్లింపులో భాగంగా 2021 నవంబర్ 8న రూ. 9 లక్షలకు గురవమ్మ రక్షణ లత కు చెక్కు ఇచ్చారు.

సదరు చెక్కును రక్షణ లత తన బ్యాంక్ ఖాతాలో వేసుకున్నారు. అది చెల్లలేదు, ఈ మేరకు ఆమె కోర్టులో కేసు దాఖలు చేసుకున్నారు. విచారణలో నేరం రుజువు అవడంతో కోర్టు తీర్పు వెలువబడింది.

Related posts

బద్దలవుతున్న జగన్‌ పీఏ అవినీతి కొండ….!!

Satyam News

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్

Satyam News

వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్న నేతలు

Satyam News

లో ప్రొఫైల్…. హై ఇంపాక్ట్‌…. లోకేష్ వర్కింగ్ స్టయిల్

Satyam News

Leave a Comment