ప్రత్యేకంహోమ్

అన్యాయమైన డిమాండ్లు లేకపోతే చర్చలకు మళ్లీ సిద్ధం

#MohammadFathali

అన్యాయమైన డిమాండ్లు పెట్టకపోతే తాము అమెరికాతో మళ్లీ చర్చలకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్ లో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో, ఇరాన్ మరోసారి అమెరికాతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయితే అమెరికా “అన్యాయమైన డిమాండ్లు” చేయకుండా, టెహ్రాన్ విధించిన షరతులను గౌరవిస్తేనే తదుపరి చర్చలు సాధ్యమని ఇరాన్ ప్రతినిధి మొహమ్మద్ ఫతాలి స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన ఫతాలి, ఇస్లామాబాద్‌లో జరిగిన తాజా చర్చల్లో అమెరికా ప్రతినిధులు చేసిన కొన్ని డిమాండ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అందువల్లే చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా ముగిసాయని తెలిపారు.

అమెరికా తమ షరతులను అంగీకరిస్తే తదుపరి రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, రాజనీతిక పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిపై కూడా ఫతాలి కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ భూభాగ జలాల్లోనే ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ పోర్టులను దిగ్బంధించాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై స్పందిస్తూ, తమ సామర్థ్యాల గురించి అమెరికాకు పూర్తిగా అవగాహన ఉందని సూచించారు.

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో, భారత్, ఇరాన్  మధ్య ప్రాంతీయ ప్రయోజనాలు ఒకే విధంగా ఉన్నాయని ఫతాలి తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా, అమెరికా వైఖరిపై విమర్శలు వ్యక్తం చేస్తూనే, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఇరాన్ సంకేతాలు ఇస్తోంది. అయితే రెండు దేశాల మధ్య నమ్మకం లోపం ఇంకా కొనసాగుతుండటం శాంతి ప్రక్రియకు అడ్డంకిగా మారుతోంది.

Related posts

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి జాత‌ర‌కు ఉగ్రవాదుల ముప్పు?

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

ఇరాన్‌ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం లో మీ వైఖరి ఏమిటి?

Satyam News

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam News

జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.4064.59 కోట్లు

Satyam News

Leave a Comment