ముఖ్యంశాలుహోమ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

#Petrol

గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ చర్చల అనంతరం, ఈ నెలలో డిమాండ్‌కు అనుగుణంగా సాధారణం కంటే 10 శాతం అదనంగా పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయడానికి ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని ట్రేడర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇకపై సరఫరా క్రమబద్ధంగా జరుగుతుందని, పుకార్లను నమ్మి కంగారు పడవద్దని అధికారులు సూచించారు.

Related posts

మోడీ నిర్ణయం పై విరుచుకుపడ్డ సోనియాగాంధీ

Satyam News

యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు

Satyam News

మెగాస్టార్ కు తొలి పత్రిక ఇచ్చిన అల్లు శిరీష్

Satyam News

ఏపీకి రూ.341 కోట్ల కేంద్రసాయం

Satyam News

ఓటర్ల జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి

Satyam News

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

Satyam News

Leave a Comment