25.7 C
Hyderabad
September 21, 2026
ప్రపంచంహోమ్

ఇరాన్‌లో సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

#IranFlag

ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో, దేశ అధికార పగ్గాలు పూర్తిగా మిలిటరీ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన భీకర దాడుల్లో ముజ్తబా ఖమేనీ ప్రాణాపాయం నుండి బయటపడినప్పటికీ, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ఆయన భార్య మరియు కుమారుడు మరణించగా, ముజ్తబా కాలికి తీవ్ర గాయమైంది. ఇప్పటికే ఆయనకు మూడు శస్త్రచికిత్సలు నిర్వహించారని, ప్రస్తుతం ఆయన నడవడానికి కృత్రిమ కాలు అవసరమని వైద్య వర్గాలు వెల్లడించాయి.

దాడుల తీవ్రత కారణంగా ముజ్తబా ముఖం, పెదాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. తన స్వరం వింటే శత్రువులు తన బలహీనతను పసిగడతారనే ఉద్దేశంతో, ఆయన కేవలం లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయనకు రహస్య ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందుతోంది.

దేశంలో ఏర్పడిన ఈ నాయకత్వ శూన్యాన్ని భర్తీ చేసే క్రమంలో, ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్’ (IRGC) రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ జనరల్స్ అయిన అహ్మద్ వహీదీ, మొహమ్మద్ బాగేర్ తదితరులే తీసుకుంటున్నారు. దీనివల్ల ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం కేవలం పేరుకే పరిమితమైంది.

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం కేవలం ఆహారం, ఇంధనం అంతర్గత శాంతిభద్రతలకే పరిమితమైంది. విదేశీ సంబంధాలు, ఇజ్రాయెల్‌పై దాడులు మరియు వ్యూహాత్మక నిర్ణయాల్లో ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేకుండా పోయింది.

ముజ్తబా ఖమేనీ తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ఇరాన్ పూర్తిగా మిలిటరీ కనుసన్నల్లోనే నడిచే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల్లో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా

Satyam News

‘మా పిల్లల రక్తం తాగిన రాక్షసులు మీరు’

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

మరో మూడు రోజులు ఒక వైపు ఎండ మరొక వైపు వాన

Satyam News

కార్తీకమాస ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Satyam News

సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

Leave a Comment