ముఖ్యంశాలుహోమ్

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

#Polavaram

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే ఉన్నారు. వీరు  మంగళవారం గ్యాప్ 1 ప్రాంతంలో ఏడు పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగిస్తున్న, మట్టి, పదార్ధాలు, రాళ్లు అన్ని నాణ్యతగా ఉన్నాయని తేలింది. ఈ పరీక్ష నిర్వహించటానికి ఏడు గంటల సమయం పడుతుంది.  బుధవారం ఇదే తరహా పరీక్షలు గ్యాప్ 2 లో ఈ బృందం నిర్వహించనుంది.  సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ డి ఈ లు శ్రీకాంత్, విజయ్ కుమార్, ఎం ఈ ఐ ఎల్  పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య ఉన్నారు.

Related posts

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Satyam News

అమెరికా బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ దాడి

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

రేవంత్ రెడ్డికి ఘాటు లేఖ రాసిన కిషన్ రెడ్డి

Satyam News

ఫెమీనా మిస్ ఇండియా గా యశికా శర్మ

Satyam News

Leave a Comment