గుంటూరుహోమ్

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

#UrduAcadamy

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తన మరణానికి పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులే కారణమని ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్, మరణ వాంగ్మూలం వెలుగులోకి రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

సమాచారం ప్రకారం, ఒక ఇంటి స్థల వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, అదే అంశంపై సీఐ వెంకట్రావు పలుమార్లు తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించారని దరియా హుస్సేన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే గంజాయి కేసు నమోదు చేస్తానంటూ బెదిరించారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

తాను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, పోలీసుల వేధింపులను భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నానని దరియా హుస్సేన్ రాసినట్లు సమాచారం. తన మరణానికి బాధ్యులుగా పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావుతో పాటు ఇద్దరు పోలీసు సిబ్బంది, మరో ఇద్దరు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

విషాదకర విషయం ఏమిటంటే, తన పుట్టినరోజు రోజే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నానని, మనశ్శాంతి లేక జీవితం కొనసాగించలేకపోతున్నానని దరియా హుస్సేన్ సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. సూసైడ్ నోట్‌లో పోలీసు అధికారుల పేర్లు ప్రస్తావించబడటంతో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరణ వాంగ్మూలం, సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. అయితే, దరియా హుస్సేన్ చేసిన ఆరోపణలపై అధికారికంగా పోలీసుల స్పందన ఇంకా వెలువడలేదు.

Related posts

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత బీమా

Satyam News

అర్హులైన జర్నిలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు

Satyam News

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

వైసీపీ రాజకీయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాపం!

Satyam News

భారతీయులకు బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు

Satyam News

నిరంతరం చెస్ క్రీడ సాధనతో మెదడుకు మేత

Satyam News

Leave a Comment