26.3 C
Hyderabad
September 19, 2026
కడపహోమ్

ఒంటిమిట్ట అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

#Ontimitta

కడప జిల్లాలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం ఒంటిమిట్ట స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్, జిల్లా కలెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానాల జేఈవో తదితర అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

ఒంటిమిట్టను తిరుమల తరహాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అదే సమయంలో, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందే కేంద్రంగా మార్చాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుతో చర్చించి, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జాంబవంతుని విగ్రహంతో ప్రత్యేక ఐలాండ్ ఏర్పాటు, ప్రధాన ప్రాంతాలకు రహదారి కనెక్టివిటీ, వేద పండితుల సూచనల మేరకు ఆధ్యాత్మిక అభివృద్ధి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఒంటిమిట్ట గ్రామ అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.

Related posts

పారదర్శకంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా

Satyam News

దేశ భద్రతలో పుట్టపర్తి ఏరోస్పేస్ క్లస్టర్ ప్రాముఖ్యత ఏమిటి?

Satyam News

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

మహిళలకు క్షమాపణ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

Satyam News

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News

Leave a Comment