అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన, కిముడు దయాకర్ 18 సంవత్సరాలు యువకుడు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుచుండగా లమ్మసింగి గవర్నమెంట్ హాస్పటల్ కి శుక్రవారం తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు, అక్కడ వైద్యులు రోగిని పరిశీలించి రక్తపరీక్ష చేయించారు.
దివాకర్ కి మలేరియా పాజిటివ్ వచ్చింది, అక్కడ మలేరియా కిట్టు లేకపోవడంతో వైద్యులు తాత్కాలిక వైద్యం అందించారు, దీంతో రోగ పరిస్థితి విస్మించడంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు మెరుగైన వైద్య నిమిత్తం తరలించారు, అక్కడ సకాలం సరైన వైద్యం అందక వైద్యులు స్పందించక తన కుమారుడు వైద్యులు నిర్లక్ష్యం వల్లనే మరణించాడని తండ్రి సింహాచలం ఆరోపించారు,
తనకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకొని తమ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
