హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు వేద అశీర్వచనం అందజేసి దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.
కార్యక్రమంలో భాగంగా వేద మంత్రోచ్చారణల మధ్య పండితులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, కవితకి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం కవిత వేద పండితుల పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించారు. దేశం, రాష్ట్రం శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయడం జరిగిందని పండితులు తెలిపారు. అలాగే కవిత జన్మదినం సందర్భంగా బంజారా పీఠాధిపతులు కూడా ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సమాజ సేవలో ఆమె చేస్తున్న కృషి అభినందనీయం అని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, అభిమానులు, పలువురు సామాజిక వర్గాల ప్రతినిధులు పాల్గొని కవితకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కవిత అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సమాజ సేవలో మరింతగా కృషి చేస్తానని తెలిపారు.
