రంగారెడ్డిహోమ్

ముచ్చింతల్‌లో సమతా మూర్తిని దర్శించుకున్న సుమ

#Suma

ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత, నటి సుమ కనకాల సోమవారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో సమతా మూర్తిని సందర్శించారు. 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహాన్ని ఆమె భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం సుమ అక్కడి అన్నప్రసాద వితరణలో పాల్గొని సందడి చేశారు. స్వయంగా  భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భక్తులతో ముచ్చటిస్తూ, సామాన్యురాలిగా వారితో మమేకమై అందరినీ ఆకట్టుకున్నారు.

శ్రీ చిన్న జీయర్ స్వామివారిని సమతా మూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాలు మరియు క్షేత్రం అద్భుత నిర్మాణ శైలిని ఆమె ప్రశంసించారు. “ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంది. రామానుజాచార్యుల సమానత్వ సందేశం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related posts

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మెలిక వెనక…. అసలు కారణం ఇదే!

Satyam News

మరోసారి దొరికిన వైసీపీ డ్రగ్ దొంగలు

Satyam News

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News

మోహన్ బాబు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

Satyam News

న్యూజెర్సీలో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు

Satyam News

పెట్రోల్, డీజిల్ తో పాటు వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

Leave a Comment