26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

వచ్చే నెలలో పెళ్లి… నేడు ప్రమాదం లో మృతి

#Accident

విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల బి.హెచ్.పి.వి (BHPV) కూడలి వద్ద అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ పాయింట్ వద్ద నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాలను, ఒక ఇన్నోవా కారును వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు లారీ చక్రాల కింద నలిగిపోయి, గుర్తుపట్టలేని విధంగా అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకరైన రామకృష్ణ తన కుమార్తె స్వప్నతో కలిసి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షకు ముందు దైవదర్శనం కోసం వెళ్తున్న తండ్రిని మృత్యువు లారీ రూపంలో కబళించింది.

మరో మృతుడు శ్రీనగర్ ప్రాంతానికి చెందిన సతీష్‌గా గుర్తించారు. వచ్చే నెలలో వివాహం నిశ్చయమైన సతీష్, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News

అన్ని ర్యాంకుల పోలీసులకు శిక్షణ తప్పని సరి

Satyam News

స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం

Satyam News

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

Satyam News

పెట్రోల్ మంటలు: నేటివి కావు.. నిన్నటి జగన్ పాలన శాపాలు!

Satyam News

కొత్త జిల్లాలలపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి

Satyam News

Leave a Comment