జగిత్యాల జిల్లాలో జగిత్యాల ధరూర్ వంతెన వద్ద ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లోకిని గంగాధర్, లోకిని రాజవ్వ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరణించిన వారిని కోరుట్ల వాసులుగా గుర్తించారు. ఆటోలో ఉల్లిగడ్డలు తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.