కడప హోమ్

రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం కొత్త కమిటీ

#railwayKodur

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం నందు శ్రీ వాసవీ అమ్మవారి ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా పెండ్యాల విజయ్ కుమార్,పాలకవర్గ సభ్యులతో కలిసి గురువారం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు  అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి  కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులుకు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ అభివృద్ధికి, సామాజిక సేవలకు వారు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు  పాల్గొన్నారు.

Related posts

నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

Satyam News

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

Satyam News

విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు

Satyam News

Leave a Comment

error: Content is protected !!