కడపహోమ్

రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం కొత్త కమిటీ

#railwayKodur

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం నందు శ్రీ వాసవీ అమ్మవారి ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా పెండ్యాల విజయ్ కుమార్,పాలకవర్గ సభ్యులతో కలిసి గురువారం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు  అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి  కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులుకు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ అభివృద్ధికి, సామాజిక సేవలకు వారు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు  పాల్గొన్నారు.

Related posts

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

మూడు నెలల్లో మూడు లక్షల ఇళ్లు రెడీ

Satyam News

వేగంగా పల్నాడు ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’

Satyam News

అమెరికా స్థావరాలపై దాడులు ఆపని ఇరాన్

Satyam News

జగన్ హత్య కేసులో లొంగిపోయిన తమీమ్

Satyam News

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News

Leave a Comment