అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం నందు శ్రీ వాసవీ అమ్మవారి ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా పెండ్యాల విజయ్ కుమార్,పాలకవర్గ సభ్యులతో కలిసి గురువారం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులుకు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ అభివృద్ధికి, సామాజిక సేవలకు వారు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు పాల్గొన్నారు.

