February 10, 2026
ఆదిలాబాద్హోమ్

24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసు పరిష్కారం

#NirmalPolice

చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే లోకేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ నెల 14న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున అనే మహిళ అబ్దుల్లాపూర్ రోడ్ పక్కన తన పశువులను మేపుతూ ఒంటరిగా ఉన్నది. దాంతో ఆమె మెడలో నుంచి బంగారం గొలుసులు దొంగలించి ఒక వ్యక్తి బైక్ పై పారిపోయాడు. సీసీ కెమెరాలలో రికార్డు అయినా సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దాంతో అతను ఆష్ట గ్రామానికి చెందిన పిప్పెర విజయ్ అనే వ్యక్తిగా గుర్తించారు.

కేసు నమోదు అయిన 24 గంటల్లోపే ఛేదించి నేరస్థుని పట్టుకున్నారు. కోర్టులో హాజరు పరచగా జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. నేరస్థుని వద్ద నుండి రెండు తులాల బంగారం పుస్తెలతాడు, నేరం చేయడానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నేరస్తుని పట్టుకున్న లోకేశ్వరం ఎస్ఐ జి.అశోక్ ను, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సాయి ప్రశాంత్, లక్ష్మణ్ లను నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, బైంసా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ జి మల్లేష్ అభినందించారు.

Related posts

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Satyam News

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

Satyam News

సిట్ నోటీసులు చిల్లర రాజకీయాలే

Satyam News

జన నాయగన్ నా ఆఖరి చిత్రం

Satyam News

రాసలీలల డీజీపీపై వేటు వేసిన ప్రభుత్వం

Satyam News

బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల ఘటనపై హరీష్ రావు విమర్శలు

Satyam News

Leave a Comment