హైదరాబాద్హోమ్

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్ర్కూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరి చేస్తూ నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్ లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ మాసంలో అక్రడేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, కమిషనర్ సిహెచ్. ప్రియాంక ప్రకటనలో తెలిపారు.

అదేవిధం జిల్లా స్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లు జారీ చేయడం జరుగుతుందని, కావున జిల్లాలో జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.

Related posts

4 లక్ష‌ల సంత‌కాలా…ప్రూఫ్ చూపించండి

Satyam News

విజయసాయి రీఎంట్రీ..వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ.!

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

బ్యాంకు రుణాలు సకాలంలో అందాలి

Satyam News

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News

జగన్‌ ఎర్రబస్సు కామెంట్.. వైసీపీని ముంచేసింది!

Satyam News

Leave a Comment