మహబూబ్ నగర్హోమ్

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం

#SunithaReddyIPS

ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వనపర్తి జిల్లాలో అమల్లో కొనసాగుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి చెప్పారు. ఎన్నికల తొలి దశలో ఫలితాలు ప్రకటించినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎంసీసీ అమల్లో ఉన్నంతకాలం ఈ ఆంక్షలను  పాటించాలని, నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించం, ఉల్లంఘనలు జరిగితే వెంటనే  కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత, శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Satyam News

కాక్ రోజ్ జనతా పార్టీ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్?

Satyam News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి మరో రూ. 8 వేల కోట్ల సాయం

Satyam News

రాజకీయ పాఠశాల ప్రజాస్వామ్యానికి పునాది..

Satyam News

జాతీయ ప్రేరణ ఉత్సవ్ పోటీలకు పట్నం రెడ్డి సాయి ఎంపిక

Satyam News

మోహన్ భాగవత్ పై కాంగ్రెస్ ఘాటు విమర్శ

Satyam News

Leave a Comment