ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వనపర్తి జిల్లాలో అమల్లో కొనసాగుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి చెప్పారు. ఎన్నికల తొలి దశలో ఫలితాలు ప్రకటించినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎంసీసీ అమల్లో ఉన్నంతకాలం ఈ ఆంక్షలను పాటించాలని, నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించం, ఉల్లంఘనలు జరిగితే వెంటనే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత, శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
