జాతీయం హోమ్

ఉపాధి హామీ చట్టం మార్పుపై కాంగ్రెస్ నిరసన

#SoniaGandhi

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న వార్తలపై గురువారం పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ నేతలు, పలు ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ మకర్ ద్వార్ వరకు సాగింది.

ఈ సందర్భంగా ఎంపీలు నినాదాలు చేస్తూ, మహాత్మా గాంధీ వారసత్వాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరని స్పష్టం చేస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు. నిరసనకారుల ప్లకార్డులపై “మహాత్మా గాంధీకి అవమానం సహించము” “మహాత్మా గాంధీ కా అప్మాన్ నహీ సహేంగే, నహీ సహేంగే” అనే నినాదాలు కనిపించాయి.

ఈ నిరసనకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించగా, ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మార్చి, కోట్లాది మందికి చట్టబద్ధమైన ఉపాధి హక్కును కల్పించిన కీలక గ్రామీణ ఉపాధి చట్టం నుంచి గాంధీ పేరును తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నేతలు ఆరోపించారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పేరు మార్పు మహాత్మా గాంధీపై మాత్రమే కాదు, సామాజిక సంక్షేమానికి సంబంధించిన రాజ్యాంగ హామీపై కూడా భావజాల దాడి అని ప్రతిపక్ష ఎంపీలు అన్నారు. “మోదీ ప్రభుత్వం దేశపిత మహాత్మా గాంధీని అవమానించడమే కాకుండా, భారత గ్రామాల్లో సామాజిక–ఆర్థిక మార్పులు తీసుకువచ్చిన ఉపాధి హక్కును కూడా తుంగలో తొక్కింది. పాలకుల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా మేము పార్లమెంట్‌ నుంచి వీధుల వరకు పోరాటం చేస్తాం,” అని ఖర్గే ఎక్స్ (X)లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

Related posts

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

Satyam News

Leave a Comment

error: Content is protected !!