విశాఖపట్నంహోమ్

మర్డర్ కు దారితీసిన క్రికెట్ మ్యాచ్

#crime

విశాఖపట్నం నగరంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ విషయంలో మొదలైన చిన్న గొడవ కాస్తా చివరకు ఒక యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవలోని పెద్ద గదిలి ప్రాంతానికి చెందిన డోలా అజిత్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా, ప్రత్యర్థి జట్టులోని కంట కిషోర్ అనే వ్యక్తికి మధ్య వివాదం చెలరేగింది. ఆట సమయంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా ఈ గొడవ సద్దుమణగలేదు. పెద్ద గదిలి జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే కిషోర్ తన అనుచరులతో కలిసి అజిత్ పై దాడికి తెగబడ్డాడు.

ఈ దాడిలో అజిత్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆరిలోవలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అజిత్ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న ద్వారక ఏసీపీ నరసింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు కంట కిషోర్‌ను పోలీసులు వెనువెంటనే అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం ఆటలో తలెత్తిన వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లడంపై మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ

Satyam News

11 విగ్గుల కథతో 11 సీట్ల జగన్ తాజా స్కెచ్ ఏమిటి?

Satyam News

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

వ్యవసాయంలో ఏపీ టాప్‌….. ప్రకృతి సేద్యానికి కేంద్రం నజరానా

Satyam News

Leave a Comment