26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

మర్డర్ కు దారితీసిన క్రికెట్ మ్యాచ్

#crime

విశాఖపట్నం నగరంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ విషయంలో మొదలైన చిన్న గొడవ కాస్తా చివరకు ఒక యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవలోని పెద్ద గదిలి ప్రాంతానికి చెందిన డోలా అజిత్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా, ప్రత్యర్థి జట్టులోని కంట కిషోర్ అనే వ్యక్తికి మధ్య వివాదం చెలరేగింది. ఆట సమయంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా ఈ గొడవ సద్దుమణగలేదు. పెద్ద గదిలి జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే కిషోర్ తన అనుచరులతో కలిసి అజిత్ పై దాడికి తెగబడ్డాడు.

ఈ దాడిలో అజిత్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆరిలోవలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అజిత్ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న ద్వారక ఏసీపీ నరసింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు కంట కిషోర్‌ను పోలీసులు వెనువెంటనే అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం ఆటలో తలెత్తిన వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లడంపై మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్టీఏ అభ్యర్ధి ఖరారు

Satyam News

జపాన్ లో తీవ్ర భూకంపం: సునామీ హెచ్చరిక

Satyam News

దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ

Satyam News

వైద్య సామాగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

Satyam News

ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తా

Satyam News

వంటగ్యాస్ రాలేదా? ఇవిగో కొత్త గైడ్ లైన్స్

Satyam News

Leave a Comment