దస్తావేజుల లేఖర్లు మరోసారి రోడ్డెక్కారు. రిజిస్ట్రేషన్ విభాగాన్ని పి పి పి విధానం ద్వారా ప్రయివేటు పరం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బుధవారం దస్తావేజుల లేఖర్ల రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు నేతృత్వం లో దస్తావేజుల లేఖర్లు రిజిస్ట్రేషన్ విభాగాన్ని ప్రయివేటు పరం చేయొద్దని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఇళ్ళు, ఇళ్ల, స్థలాలు, భూముల రిజిస్ట్రేషన్ లను ప్రభుత్వం పి పి పి విధానం లో ప్రయివేటు పరం చేస్తే రిజిస్ట్రేషన్ ల పై ఆధార పడి వాటినే ఉపాధి అవకాశాలుగా నమ్ముకుని ఉపాధి పొందున్న రాష్ట్రం లో లక్ష కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ విభాగాన్ని పి పి పి పద్ధతి లో ఫ్రీవేటుపరం చేయవద్దని దస్తావేజుల లేఖర్ల పొట్ట కొత్త వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
