కృష్ణహోమ్

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

#PaddyCrop

యూరియాను అధిక మోతాదులో విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూరియాను శాస్త్రీయ నిష్పత్తి (4:2:1) కి బదులుగా రైతులు విపరీతంగా (7:2.8:1) వాడుతున్నారన్నారన్నారు.

దీనివల్ల నేల నిస్సారం కావడం, తెగుళ్లు పెరగడం, పెట్టుబడి ఖర్చు పెరగడం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడతాయన్నారు. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సూచించిన కొన్ని ఆధునిక పద్ధతుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునన్నారు. దీనిలో భాగంగా 500 ఎమ్ఎల్ బాటిల్ నానో యూరియా 45 కిలోల  బస్తా యూరియాతో సమానమని అన్నారు.

భూసార పరీక్షల ద్వారా  20% వరకు యూరియా వాడకాన్ని తగ్గించవచ్చున్నారు. వేప పూత పూసిన యూరియా  (నీమ్ కోటెడ్ యూరియా) వాడకం వల్ల నత్రజనిని మొక్కలకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంచుతుందన్నారు. యూరియా అనేది పంటకు మందు లాంటిదని, మోతాదు మించితే విషంగా మారుతుందని అన్నారు. సుస్థిర, లాభదాయక వ్యవసాయం కోసం శాస్త్రీయ పద్ధతులు పాటించాలని ఉప కులపతి డా. శారదా జయలక్ష్మి దేవి ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

విద్యా సంఘాల పేరుతో దౌర్జన్యం వద్దు

Satyam News

బాణసంచా పరిశ్రమలో పేలుడు:18 మంది మృతి

Satyam News

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

Satyam News

అంగరంగ వైభవంగా భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

Satyam News

ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువ: జాగ్రత్త

Satyam News

జగన్ ముందు అమరావతి పెట్టిన మరో పరీక్ష

Satyam News

Leave a Comment