టీడీపీ నేత, గుంటూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కుమారుడి వివాహ వేడుకకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు మణి శంకర్, వెంకట ఐశ్వర్యలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
