26.7 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

#GannavaramAirport

గన్నవరం విమానాశ్రయంపై తుఫాన్‌ “మొంథా” ప్రభావం తీవ్రంగా కనిపించింది. సాధారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌, కడప, విశాఖపట్నం వంటి నగరాల నుంచి రోజూ 21 విమానాల రాకపోకలు జరిగే గన్నవరం ఎయిర్‌పోర్టులో మంగళవారం భారీ అంతరాయం ఏర్పడింది. తుఫాన్‌ ప్రభావంతో మొత్తం 16 విమాన సర్వీసులను రద్దు చేశారు.

ఇందులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 9 సర్వీసులను రద్దు చేయగా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ షార్జా, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖ సర్వీసులను రద్దు చేసింది. ఎయిర్‌ ఇండియా సంస్థ ఢిల్లీ, ముంబై సర్వీసులను రద్దు చేసినట్లు అధికారిక సమాచారం. తుఫాన్‌ ప్రభావం కారణంగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో వర్షాలు, గాలులు కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విమాన సర్వీసులు పునరుద్ధరించే విషయంపై వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Related posts

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

Satyam News

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News

‘‘అక్రమ’’ జర్నలిస్టు అరెస్టు

Satyam News

కెసిఆర్ అప్పులన్నీ అభివృద్ధికి పెట్టుబడులే..

Satyam News

బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌!

Satyam News

ఏపీ లో ఇలా జరుగుతున్నది ఏమిటి?

Satyam News

Leave a Comment