ఆదిలాబాద్హోమ్

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెళ్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భైరవ నామ స్మరణతో మారుమోగింది.

ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులంతా భజన కీర్తనలతో పునీతులయ్యారు.

అనంతరం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కలికోట రమాదేవి-సంతోష్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పారుపెళ్లి కాలభైరవ ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

Related posts

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: 3 వేల మంది టీచర్ల తొలగింపు!

Satyam News

అజిత్ పవార్ విమానం కూలింది ఇలా…

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

ఏపీలో UAE ఫుడ్ క్లస్టర్…. రైతన్నలకు గ్లోబల్ మార్కెట్.!

Satyam News

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News

Leave a Comment