ఆదిలాబాద్హోమ్

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెళ్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భైరవ నామ స్మరణతో మారుమోగింది.

ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులంతా భజన కీర్తనలతో పునీతులయ్యారు.

అనంతరం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కలికోట రమాదేవి-సంతోష్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పారుపెళ్లి కాలభైరవ ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

Related posts

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News

దేశ బడ్జెట్ 2026 ఏ రంగానికి ఎంతంటే..?

Satyam News

పెట్రోల్ మంటలు: నేటివి కావు.. నిన్నటి జగన్ పాలన శాపాలు!

Satyam News

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

Satyam News

ఏపీ లో ఇలా జరుగుతున్నది ఏమిటి?

Satyam News

Leave a Comment