26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

మే 1న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

#SriGovindarajaSwamyTemple

చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మే 1వ తేదీన శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగనుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు, ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్‌ తదితర దేవేరులు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు.

అక్కడ స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ గోవిందరాజస్వామి వారు వచ్చే సమయంలో అమ్మ వారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు.

బావగారైన శ్రీ గోవిందరాజస్వామి వారు వచ్చారని శ్రీ పద్మావతీ అమ్మవారు లోపల నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడి నుండి స్వామివారు తిరిగి ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 9.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. దీంతో ఉత్సవం ముగుస్తుంది.

Related posts

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

Satyam News

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

Satyam News

శ్రీవారికి వెండి గంగాళం విరాళం

Satyam News

కూపుచంద్రపేటలో ఫిబ్రవరి 2న స్నపన తిరుమంజనం

Satyam News

మహిళల సమస్యల సత్వర పరిష్కారానికి ఆన్ లైన్ పోర్టల్

Satyam News

జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలు

Satyam News

Leave a Comment