పశ్చిమగోదావరిహోమ్

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో యాదవ కార్తీక వన సమారాధనలో ఏలూరు ఎమ్ పి.   ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ పి మాట్లాడుతూ ‎యాదవులు పారిశ్రామికవేత్తలుగా  ఎదగాలని ఆకాంక్షించారు.  ఏలూరు పార్లమెంట్ ను మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయనున్నట్టు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఒక యాదవుడిగా పుట్టడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. యాదవ కార్తీక వన సమారాధనలో పాల్గొనడం ఆనందంగా ఉందని పుట్టా మహేష్ అన్నారు.‎ తప్పిపోయిన బాలికలు, మహిళల ఆచూకీ కనిపెట్టేందుకు ఆధునిక సాంకేతికత ను అందిపుచ్చుకుని  పోలీసు శాఖతో కలిసి పనిచేస్తూ, ఒక ఎన్జీవో  ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

Related posts

నిమ్స్‌లో వెయ్యి మంది పేషెంట్లకు రొబోటిక్ సర్జరీలు

Satyam News

బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

Satyam News

గవర్నర్ ను కలిసిన టీవీకే అధినేత విజయ్

Satyam News

అప్పుల ఊబిలో కూరుకుపోయిన కేరళ

Satyam News

లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: రాజ్‌ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు

Satyam News

ఆయుర్వేదానికి ఆదరణ పెరగాలి

Satyam News

Leave a Comment