విశాఖపట్నంహోమ్

గోమాంసం గోడౌన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి

#Vizag

విశాఖపట్నంలో అక్రమ గోమాంసం నిల్వ చేశారని చెబుతున్న గోడౌన్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆనందపురం ప్రాంతంలోని శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజ్ వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోల్డ్ స్టోరేజ్‌లో గోమాంసం నిల్వ చేసి ఉన్నారని వచ్చిన సమాచారం నేపథ్యంలో పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. సీజ్ చేసిన గోమాంసాన్ని తమకూ చూపించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యకర్తలు కోల్డ్ స్టోరేజ్ లోపలికి తీసుకెళ్లి నిజాలు చూడాల్సిన హక్కు తమకుందని పట్టుబడగా, దానిని పోలీసులు అంగీకరించలేదు. విచారణలో ఉన్న కేసుకు సంబంధం లేని వ్యక్తులను లోపలికి అనుమతించే పరిస్థితి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారి కొంతసేపు ఉద్రిక్తత చెలరేగింది. రెండు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కోల్డ్ స్టోరేజ్ వద్ద కొంతసేపు పోలీసుల హెడ్రామా కొనసాగగా, ప్రాంతంలో ఉద్రిక్తత కారణంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత అధికారులు విషయాన్ని సమీక్షించి పరిస్థితిని శాంతింపజేశారు.

Related posts

చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం

Satyam News

ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్ ధ‌ర‌లు త‌గ్గించాలి

Satyam News

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

Satyam News

అమరావతికి కేంద్రం వరాలు: సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణం

Satyam News

పోలవరం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర గవర్నర్

Satyam News

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

Satyam News

Leave a Comment