రెవెన్యూ స్థలాలు అక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు డిప్యూటీ తహశీల్దార్ వంశీ రెడ్డి. రాయచోటి మండలం మాసాపేట గ్రామంలో సర్వే నెంబర్ 9821 నందు 5.83 విస్తీర్ణంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తహశీల్దార్ నరసింహ కుమార్ ఆధ్వర్యంలో ఆర్ ఐ,విఆర్వో సిబ్బందితో కలిసి ఇది ప్రభుత్వ స్థలం అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు డిటి వంశీ రెడ్డి పేర్కొన్నారు.
గతంలో కూడా ఇక్కడ ప్రభుత్వ స్థలమంటూ రెవిన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది కబ్జాదారులు గుర్తుతెలియని వ్యక్తులు బోర్డు తొలగించినారని ఇకపై అలా చేస్తే రెవిన్యూ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
