ప్రపంచంహోమ్

ఆసిమ్ మునీర్ తో అబ్బాస్ అరాగ్ఛీ చర్చలు

#AsimMunir

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఛీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో నేడు ఇస్లామాబాద్ లో సమావేశమయ్యారు. అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చర్చల్లో స్థబ్దత నెలకొన్న సమయంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఛీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మద్య ప్రాంతీయ భద్రత, మధ్యప్రాచ్య పరిణామాలు, అలాగే అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇస్లామాబాద్ నగరం ఈ సమయంలో కఠిన భద్రతా చర్యలతో కట్టడి చేసి ఉంది.

ముఖ్య రహదారులు మూసివేశారు. అత్యంత భద్రతా ప్రాంతంగా భావించే రెడ్ జోన్‌ను పూర్తిగా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశాలు సాగుతున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రిని స్వాగతించడం సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం పరస్పర చర్చలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, అమెరికా వైట్ హౌస్ ప్రకటించిన ప్రకారం, అమెరికా ప్రతినిధులు స్టీవ్ వెట్ కాఫ్, జార్డ్ ఖుష్నర్ కూడా ఇస్లామాబాద్ రానున్నారు. ఇరాన్‌తో జరగబోయే చర్చల కోసం ఈ పర్యటనలు కీలకంగా భావించబడుతున్నాయి.

అయితే, ఇరాన్ స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో సమావేశం జరగదని తేల్చిచెప్పింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు, భద్రతా పరిస్థితులు వచ్చే రోజుల్లో ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

Satyam News

మంత్రి పొంగులేటి తో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీ

Satyam News

పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యత

Satyam News

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News

హెరిటేజ్ పై తప్పుడు సమాచారం ఇచ్చిన బొత్స

Satyam News

జగన్‌ పెళ్లి గోల… జనానికి బ్యాండ్‌.. బాజా..!!

Satyam News

Leave a Comment