ప్రత్యేకంహోమ్

పైలెట్ కోసం వచ్చిన అమెరికా దళాలను తిప్పికొట్టిన ఇరాన్

అమెరికా శతృవుల కుట్రలను తిప్పికొడుతూ ఇరాన్ మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కూలిపోయిన తన యుద్ధ విమాన పైలట్‌ను రక్షించే నెపంతో ఇరాన్ గడ్డపైకి చొరబడాలని చూసిన అమెరికా దళాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

దేశం నడిబొడ్డున శతృవుల కదలికలను గుర్తించిన ఇరాన్ సాయుధ బలగాలు మెరుపు దాడిని నిర్వహించాయి. ఏరోస్పేస్ ఫోర్స్, గ్రౌండ్ ఫోర్స్, పాపులర్ మొబిలైజేషన్, బాసిజ్ మరియు ఫరాజా దళాల సంయుక్త ఆపరేషన్‌లో శతృ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

గతంలో తబాస్ ఆపరేషన్‌లో ఎదురైన అవమానకరమైన ఓటమిని తలపిస్తూ అమెరికా మరోసారి అంతర్జాతీయ వేదికపై తలవంచుకోవాల్సి వచ్చింది. ఈ ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు.

ఇరాన్‌లో కూలిపోయిన విమాన పైలట్‌ను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. తబాస్ ఇసుక తిన్నెల్లో అగ్రరాజ్యానికి గుణపాఠం చెప్పిన దైవమే నేటికీ ఇరాన్ రక్షణ కవచంగా ఉన్నాడని, జూదరి ట్రంప్ ఎన్ని కుతంత్రాలు చేసినా ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదని ఈ విజయం నిరూపించింది.

శతృవుల వ్యూహాలను చిన్నాభిన్నం చేస్తూ ఇరాన్ జవాన్లు చూపిన శౌర్య పరాక్రమాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Related posts

తెలంగాణ లో ‘‘సర్’’ అమలుపై చర్యలు

Satyam News

మూడు ముక్కలైన కేసీఆర్ పార్టీ

Satyam News

చంద్రబాబు.. ది అన్‌స్టాపబుల్‌.. . దేశంలోనే టాప్‌ పారిశ్రామికవేత్త సంచలనం..!!

Satyam News

బంగారం స్మగ్లింగ్: నటి రన్యారావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా

Satyam News

వైసీపీ రాజకీయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాపం!

Satyam News

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

Satyam News

Leave a Comment