హైదరాబాద్హోమ్

వెలుగుమట్ల బాధితుల కోసం కొనసాగుతున్న దీక్ష

ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తన దీక్షను కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం దీక్షా శిబిరంలో ఉన్న కవిత వివిధ దినపత్రికలను చదువుతూ కనిపించారు. అంతకుముందు సోమవారం నాడు ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో వెలుగుమట్ల బాధితులు మరియు డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి ఆమె భారీ ఆందోళన నిర్వహించారు.

ఆ సమయంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఆమె తన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే మంగళవారం ఉదయం పోలీసులు కవితతో పాటు దీక్షలో ఉన్న ఇతర నాయకులను మళ్ళీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

పోలీసుల అడ్డంకులు ఎదురైనప్పటికీ, బాధితుల కోసం తన పోరాటాన్ని ఆపకుండా హైదరాబాద్ జాగృతి కార్యాలయం వేదికగా ఆమె తన దీక్షను కొనసాగిస్తున్నారు.

Related posts

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

Satyam News

ఏపీకి కేంద్రం కీలక ప్రాజెక్ట్‌… దేశానికే కీలకం…!!

Satyam News

యూరియా నిల్వ చేయవద్దు

Satyam News

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

Satyam News

ఘనంగా గౌలిపుర మహంకాళి అమ్మవారి బోనాల వేడుక

Satyam News

Leave a Comment